AP CM YS Jagan: ఏపి (ANdhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం కర్నూలు (Kurnool) జిల్లా ఆదోనిలో జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించి విద్యార్ధులకు కిట్లు పంపిణీ చేశారు. రూ.931 కోట్లు వెచ్చించి దాదాపు 47 లక్షల మంది విద్యార్ధులకు కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్..విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. పేదరికం నుండి బయటపడాలంటే చదువు అవసరమనీ, అది నాణ్యమైన చదువుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం జగన్. వరుసగా మూడవ ఏడాది జగనన్న విద్యాకానుక ఇస్తున్నామని, విద్యాకానుక కిట్లలో నాణ్యత పెంచుకుంటూ పోతున్నామని వెల్లడించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP CM YS Jagan: బుడగ జంగాలు, బోయలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో
ఇదే క్రమంలో బుడగ జంగాలు, బోయల రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించారు సీఎం వైఎస్ జగన్. ఈ వర్గాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ చాలా కాలం నుండి ఉంది. దీన్ని పురస్కరించుని సీఎం జగన్..బుడగ జంగాలు, బోయలను ఎస్సీ, ఎస్టీ ల్లో కలిపే ప్రక్రియ వేగవంతం చేస్తామని సీఎం వెల్లడించారు.
AP CM YS Jagan: ఆదోనికి వరాల జల్లు
స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తిపై ఆదోనికి పలు హామీలను ఇచ్చారు సీఎం జగన్. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆటో నగర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదోనిలో రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.