అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కోలో, చివరకు అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా గత చంద్రబాబు పాలనలో బారీగా దోపిడీ జరిగిందని, సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ వందల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేశారని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వివరించారు. ఏపి అసెంబ్లీలో చర్చ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో అవినీతిని ఆయన పీఏ శ్రీనివాస్, మనోజ్ డీల్ చేశారని అన్నారు. ఆర్ వి ఆర్ రఘు, కృష్ణ, నారాయణ సంస్థలకు నిధులను మళ్లించారనీ, చివరకు నిధులు అన్నీ మళ్లీ చంద్రబాబు జేబులోకే చేరాయని ఆరోపించారు.
అమరావతిలో జరిగిన నిర్మాణాలను షాపూర్ జి పల్లోంజి సంస్థ చేపట్టిందనీ, ఆ సంస్థ ప్రతినిధి వాసుదేవ్ మనోజ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మధ్య డీల్ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ సంస్థపై 2019 లో ఐటీ రైడ్స్ జరిగాయని గుర్తు చేశారు. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మీద ఐటీ రైడ్స్ జరిగాయన్నారు. ఫైనల్ గా ఐటీ శాఖ చంద్రబాబుకు కూడా నోటీసులు పంపించిందని వెల్లడించారు. ఏడు వేల కోట్ల పనులు ఇచ్చి అందులో 5 శాతం కమీషన్ రూ.143 కోట్లను కలెక్ట్ చేసే విధంగా అడుగులు వేశారన్నారు. అవే కాకుండా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఉన్న వ్యక్తులు కూడా రూ.371 కోట్లు లూటీ చేశారని అన్నారు.
చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిలో రామోజీరావు కుమారుడి వియ్యంకుడి పాత్ర కూడా ఉందని అన్నారు సీఎం జగన్. ఒక పద్దతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి .. దోచుకో.. పంచుకో.. తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేసారో ఆధారాలతో సహా దొరికిపోయారన్నారు. ఇంతకు ముందు కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, గత ప్రభుత్వం కంటే ఇప్పటి ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువ అని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా నాలుగేళ్లు కూడా గడవకముందే అక్షరాలా 2లక్షల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లోకి మన ప్రభుత్వం పంపిచిందన్నారు.
క్రాస్ ఓటింగ్ పై వైసీపీ సీరియస్ ..ఆ నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్