NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: పారిశ్రామికంగా ఏపిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్

YS Jagan:  రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటాననీ, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి వద్ద రూ.270 కోట్లతో నిర్మిస్తున్న అసాగో ఇండస్ట్రీస్ బయో ఇథనాల్ యూనిట్ కు సీఎం జగన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ .. దేవుడి దయతో ఇవేళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.

CM YS Jagan
CM YS Jagan

 

దావోస్ పర్యటనలో అనేక మంది పారిశ్రామిక వేత్తలను కలిశానని చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు ఏపి లో మంచి వాతావరణం ఉందన్నారు. టెక్నాలజీకి సంబంధించిన మాటలు మాట్లాడుతున్న సమయంలో టెక్ మహేంద్రా గ్రూపు సీఇఓ సీపీ గుర్నానీ ఇథనాల్ కు సంబంధించి పరిశ్రమ గురించి అడిగారన్నారు. కేవలం ఆరు నెలల్లోనే భూములు ఇవ్వడం దగ్గర నుండి అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో టెక్ మహేంద్రా గ్రూపు రూ.280 కోట్లతో ఈ ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తొందని చెప్పారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. బ్రోకెన్ రైస్ తో ప్లాంట్ లో ఇథనాల్ తయారీ చేస్తారని చెప్పారు. ప్లాంట్ తో పాటు బై ప్రొడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రొటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుందని సీఎం అన్నారు.

CM YS Jagan

ఈజ్ ఆఫ్ డూయింగ్ కు ఏపి ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు. సీపీ గుర్నానీ ఇతర పారిశ్రామిక వేత్తల వద్ద కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సందర్భంలో ఏలూరు కుడి కాల్వ నిర్మాణానికి సంబంధించి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. దీని వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, అశీష్, మంత్రులు గుడివాడ అమరనాథ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాల కృష్ణ, ఎంపీలు భరత్ రామ్, అనురాధ, వంగా గీత, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju