NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పొత్తుల కోసం ఎందుకీ వెంపర్లాట అంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ విసుర్లు

దుష్టచతుష్టయానికి సవాల్ విసురుతున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు ఈ తేడేళ్లు ఏకమవుతున్నాయని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని మాట్లాడారు. అర్హత లేని వారు ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని మండిపడ్డారు. మనది డీబీటీ ప్రభుత్వం వాళ్లది డీపీటీ అని విమర్శించారు. మన ప్రభుత్వంలో డీబీటీ .. డైరెక్ట్ బెన్ ఫిట్ ట్రాన్స్ ఫర్ అయితే గత ప్రభుత్వంలో డీపీటీ.. దోచుకో, పంచుకో.. తినుకో అంటూ దుయ్యబట్టారు. రాజకీయ విలువలు లేని దుష్టచతుష్టయంతో తాను పోరాడుతున్నానని అన్నారు. ఎన్నికల బరిలో ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని నిలదీశారు.

AP CM YS Jagan

 

తాను ఎవరి మీద ఆధారపడననీ, దేవుడు, ప్రజల మీదనే ఆధారపడతాననీ తెలిపారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుందని అన్నారు. సినిమాల్లో హీరోలే నచ్చుతారు కానీ విలన్ లు కాదని పేర్కొన్నారు. పేదరికం నుండి బయటపడాలంటే అది విద్యతోనే సాద్యం అవుతుందని అన్నారు. పిల్లలకు ఆస్తి మనం ఇచ్చే చదువేనని తెలిపారు. పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామన్నారు. బలహీన వర్గాలు బలపడాలంటే అది విద్యతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఒక మనిషి జీవన ప్రమాణం, జీవన ప్రయాణం నిర్దేశించేది చదువేనని తెలిపారు. తల్లుల ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. కళాశాలలో సమస్యలుంటే 1092 కి ఫిర్యాదు చేస్తే తాము మాట్లాడతామని పేర్కొన్నారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి పట్ల స్పందించే హృదయం తనది అని అన్నారు. సామాజిక, మహిళ, రైతులకు న్యాయమని నమ్ముతానని చెప్పారు.

 

గడప గడపలో సంతోషం చూడాలని ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనసు ఈ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవని అన్నారు. కళాశాల ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత తమదేనన్నారు. గత ప్రభుత్వంలో అరకొర ఫీజులు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజులు కట్టలేక చదువులు మానివేసే పరిస్థితి రాకూడదన్నారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.698.68 కోట్లు జమ చేస్తున్నామన్నారు. పూర్తి పీజు రీయింబర్స్ మెంట్ ద్వారా రూ.9947 కోట్లు అందించామని, దీని ద్వార 27 లక్షల మంది విద్యార్ధులకు లబ్ది జరిగిందన్నారు.

TDP MLC: ముగిసిన డిక్లరేషన్ వివాదం .. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju