NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

నేడు 12.30 గంటలకు ప్రధాని మోడీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం.. విశేషం ఏమిటంటే..?

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం (ఈరోజు) మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో అపాయింట్మెంట్ ఖరారు అయిన నేపథ్యంలో నిన్న రాత్రికే సీఎం జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. రాత్రి సీఎం అధికారిక నివాసంలో బస చేసిన జగన్ ఈ రోజు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈ ఏడాది ప్రధాన మంత్రితో జరిగే చివరి భేటీ ఇది. గత ఏడాది ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ లభించడంలో కొంత ఇబ్బందులు తలెత్తినా ఈ ఏడాది 2023 సంవత్సరంలో మాత్రం ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రుల ఆపాయింట్మెంట్ లు సులువువా లభించడం, వెంటవెంటనే వారితో సమావేశాలు పూర్తి చేసుకుని ఏపికి తిరిగి రావడం జరిగింది.

AP CM YS Jagan to Meet PM Narendra Modi Today Afternoon

 

ఏపిలో రాజకీయంగా అధికార వైసీపీని బీజేపీ విమర్శలు చేస్తున్నా కేంద్రంలో అధికార బీజేపీతో జగన్, వైసీపీ (కేంద్ర ప్రభుత్వం) సఖ్యతగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తూనే ఉంది. ఇదే క్రమంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కు కీలక బిల్లుల ఆమోదం కోసం అవసరమైన సందర్భాల్లో వైసీపీ సహకరిస్తూ వచ్చింది. ఏపిలో ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకే అన్ని రాజకీయ పార్టీలు సన్నద్దంగా ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. వైసీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు జనాల్లో తిరుగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని అధికార వైసీపీ నేతలు, మంత్రులు చెబుతున్నా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వంపై సమీక్షలు జరుపుతుండటం, నెలలో రెండు మూడు జిల్లాల పర్యటనలు పెట్టుకుని ఆ సభల్లో ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ప్రజలకు మంచి జరిగింది అని భావిస్తేనే వైసీపీని మళ్లీ ఆశీర్వదించాలని కోరుతుండటం తదితర పరిణామాలు ముందస్తు ఎన్నికలకు సూచనలేనని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రధాన మంత్రి భేటీలో సీఎం జగన్ .. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై చర్చించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది. .కాగా  ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, పార్టీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, ఎంపి అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు.

విషాదాన్ని నింపిన విహార యాత్ర .. ఫోటోలు దిగుతుండగా ప్రమాదం..ఆమెరికాలో తెలుగు దంపతులు మృతి..

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!