విశాఖ బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియన్ యుద్ద విమాన మ్యూజియంను సీఎం వైఎస్ జగన్ గురువారం ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో అధికారులతో కలియతిరిగి తిలకించారు. ఈ సందర్భంగా మ్యూజియం ప్రత్యేకతలను నేవీ అధికారులు సీఎం జగన్ కు వివరించారు. రామ్ నగర్ లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్టోర్స్ ఎరీనా ను సైతం సీఎం జగన్ ప్రారంభించారు. అంతకు ముందు విశాఖ అరిలోవలో అపోలో ఆసుపత్రి లో క్యాన్సర్ సెంటర్ ను సీఎం జగన్ ప్రారంభించారు. అనంతరం రేడియేషన్ ఎక్విప్ మెంట్ ను పరిశీలించారు. తదుపరి ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడారు. వారి కోరిక మేరకు వైద్యులతో గ్రూప్ ఫోటో దిగారు సీఎం జగన్.
వైఎస్ఆర్ క్రికెట్ స్టేడింలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2ను సీఎం జగన్ ప్రారంభించి, రంజీ ప్లేయర్స్ తో ముచ్చటించారు. క్రీడల్లో మరింత రాణించాలని జగన్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మహిళా క్రికెటర్లు సబనామ్, అంజలిని ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రూ.10లక్షల చెక్కును క్రీడాకారులకు అందజేశారు. క్రికెట్ స్టేడియంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ కన్వెన్షన్ హాలులో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హజరై నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను సీఎం జగన్ ఆశీర్వదించారు. తొలుత విశాఖకు చేరుకున్న జగన్ ను ఎయిర్ పోర్టులో నగర మేయర్ హరివెంకట కుమారి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమరనాథ్, విప్ కరణం ధర్మశ్రీ, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, తదితరులు స్వాగతం పలికారు.
Centre vs Delhi govt case: సుప్రీం కోర్టులో కేంద్రానికి షాక్ .. ఢిల్లీలో అధికారంపై సంచలన తీర్పు