AP CM YS Jagan: ఓ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 9వ తేదీన విశాఖపట్నం వెళ్లనున్నారు. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులకు కొందరు స్వామీజీలపై గురి ఉంటుంది. ఆ స్వామీజీలు అంటే గౌరవం, భక్తి ఉంటాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ (పీకే) స్ట్రాటజీలు ఒక కారణం కాగా విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ ఆశీస్సులు, ఆయన నిర్వహించిన యజ్ఞ యాగాలు మరొక కారణంగా భావిస్తుంటారు.
AP CM YS Jagan: 9వ తేదీన ప్రత్యేక విమానంలో విశాఖకు
జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే శారదా పీఠానికి వెళ్లి స్వామిజీ ఆశీస్సులు స్వీకరించారు. గత ఏడాది కూడా ఆశ్రమంలో జరిగిన శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు సీఎం జగన్ హజరైయ్యారు. ఈ ఏడాది శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలకు సంబంధించి గత నెలలో ఆ పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి ఆహ్వానపత్రాన్ని జగన్ అందించారు. స్వామీజీ ఆహ్వానం మేరకు ఈ నెల 9వ తేదీన గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ వెళుతున్నారు.
శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలు
శారదా పీఠంలో జరిగే వార్షికోత్సవ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అక్కడ జరిగే రాజ్యశ్యామల యాగ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం స్వామిజీ ఆశీస్సులు అందుకుని తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు. సీఎం వైఎస్ జగన్ విశాఖ శారదా పీఠంలో జరిగే అధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇది మూడవ సారి. ఆ స్వామిజీ సూచనల మేరకే జగన్మోహనరెడ్డి విశాఖకు రాజధాని చేసేందుకు మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చారని గతంలో ప్రచారం జరిగింది.