ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ నెల 2వ తేదీ నుండి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. ఈ నెల 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు గానూ గురువారం (2వ తేదీ) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి బయలుదేరనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు విశాఖకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మూడవ తేదీ ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో సీఎం జగన్ పాల్గొంటారు. రాత్రి 8, 9 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్స్ కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. 4వ తేదీ ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకుని రెండో రోజు సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంలటు విశాఖ నుండి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ పర్యటనకు చాలా సార్లు వెళ్లారు. అయితే ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే.. వరుస రోజులుగా విశాఖలోనే బస చేస్తున్నారు. తొలి నుండి సీఎం జగన్ విశాఖ అంటే ప్రత్యేక అభిమానం చూపుతున్నారు. ఈ క్రమంలోనే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని సంకల్పించారు. ఈ రీతిలో అడుగులు వేస్తున్నారు. తన మకాంను కూడా తాడేపల్లి నుండి విశాఖకు షిఫ్ట్ చేసి అక్కడి నుండి పరిపాలన సాగించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో జరిగిన ఇన్వెస్టర్స్ సదస్సులో వెల్లడించారు సీఎం జగన్. విశాఖ పరిపాలనా రాజధాని అవ్వడానికి ముందే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచ స్థాయిలో పెట్టుబడుల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ ఏకంగా మూడు రోజులు విశాఖ బస చేయడం జరుగుతుండటం విశేషం.