AP Govt: ఏపి ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఉంది. నవరత్న పథకాల అమలులో భాగంగా క్యాలెండర్ ప్రకారం సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి ఆయా పథకాల లబ్దిదారుల ఖాతాలో నేరుగా నిధులను జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవేళ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు లబ్దిదారులకు ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఏపి సీఎం వైఎస్ జగన్ ఇవేళ వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేయనున్నారు. తన క్యాంప్ కార్యాలయం నుండి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. ఈ ఏడాది జనవరి నుండి మార్చిలో వివాహాలు చేసుకున్న అర్హులైన 12,132 మంది లబ్దిదారులకు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద రూ.87.32 కోట్ల నిధులను విడుదల చేయనున్నారు.
పదవ తరగతి తప్పనిసరి
వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా పథకం కింద ఆర్ధిక సాయం పొందాలంటే వధువరులు ఇద్దరూ పదవ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది ప్రభుత్వం. నూరు శాతం అక్షరాశ్యతే లక్ష్యం కాకుండా నూరు శాతం గ్యాడ్యుయేట్ లుగా మన పిల్లలను తీర్దిదిద్దాలన్న సమున్నత లక్ష్యంతో వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా లకు పదవ తరగతి ఉత్తీర్ణత, వధువుకు కనీస వయోపరిమితి 18 ఏళ్లుగా, వరుడికి 21 ఏళ్లుగా ప్రభుత్వం నిర్దేశించింది. గడచిన ఆరు నెలల్లో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద 16,668 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.125.50 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. అయితే ఇంతకు ముందు వధువు ఖాతాలో కళ్యాణ మస్తు, షాదీ తోఫా నిధులను జమ చేసే వారు. అయితే తాజాగా ప్రభుత్వం ఆ నిదులను వధువు (పెళ్లి కూతురు) తల్లుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది.
AP High Court: ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ లకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ .. జైలు శిక్ష, జరిమానా