ప్రజల కోసం పని చేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్పూర్తిదాయకమని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఇవేళ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా సీఎం జగన్ .. తెలుగు ప్రజలకు శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు. ప్రజల కోసం పని చేసే ఏ ప్రభుత్వానికైనా రామరాజ్యమే స్పూర్తిదాయకం, ప్రతి ఇంటా సంతోషాలు నింపేలా సాగిన రాముడి పాలనే ఉత్తమ మార్గమన్నారు. మాట ఇస్తే తప్పని నైజం, దాని కోసం ఎన్నికష్టాలైనా ఓర్చుకునే తత్వం ఆ శ్రీరాముడి గుణం అని వివరించారు. నైతిక, సంఘ ప్రవర్తనలో ఎన్నటికీ ఆదర్శం, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.
ప్రధాన మంత్రి మోడీని కలవకుండానే వెనుదిరిగిన సీఎం వైఎస్ జగన్ .. అమిత్ షాతో చర్చించిన అంశాలు ఇవి