AP CS Adityanath Das: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వామివారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటుంటారు. పేద,బిక్కీ అనే తేడా లేకుండా సామాన్యుల మొదలు కొని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి తమ శక్తికొలది కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సతీసమేతంగా ఆదివారం తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.
Read More: AP CS Adityanath das: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించిన కేంద్రం
తొలుత సంప్రదాయం ప్రకారం ఆయన బాలాలయ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయానికి చేరుకుని ధ్వసస్తంభానికి మొక్కుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సీఎస్ కు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.
Read More: ycp government: ఏమిటో ఈ కేంద్రం తీరు..! ఏపికి అనుకూలంగా ఉన్నట్లే ఉంటుంది..! కానీ..?
సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిన్ననే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు వచ్చిన మరుసటిరోజే ఆదిత్యనాథ్ దాస్ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ అదిత్యనాథ్ దాస్ సీఎస్గా కొనసాగనున్నారు.