YSRCP: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అవునన్నా కదన్నా నూటికి నూరు శాతం నిజమే. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా అప్పులు తెచ్చీ మరీ నవరత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అభివృద్ధి విషయాన్ని పక్కన బెడితే వివిధ పథకాల పేరుతో ప్రజలకు నేరుగా డబ్బుల పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా చూసుకుంటే ఏపి ప్రధమ స్థానంలో ఉంటుంది.
అయితే జగన్ సర్కార్ పై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందనీ, పలు జిల్లాల్లో వైసీపీ నేతల మధ్యే విభేదాల కారణంగా ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని వార్తలు వినబడుతున్నాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఒక వేళ ప్రభుత్వ రాబోయే ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేకతతో కొన్ని స్థానాలు కోల్పోయినా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో 90కి పైగా స్థానాలతో అధికారాన్ని నిలబెట్టుకుంటుదని ఆ పార్టీ నేతల్లో బలంగా ఉంది.
YSRCP: రాజకీయ సన్యాసం తీసుకుంటా
వైసీపీ విభేధాలు రచ్చకెక్కాయనీ, రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదనీ టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఉప ముఖ్యమంత్రి దర్మాన కృష్ణదాస్ స్పందించారు. ఈ సందర్భంలో ఆయన ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. జగన్ ఒక వేళ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు ధర్మాన కృష్ణదాస్. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్లకు తోడు ఉంటాడనీ అందుకే గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందన్నారు. ప్రజలు, మహిళల సహకారంతో మళ్లీ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వస్తుందని ధర్మాన స్పష్టం చేశారు. వైసీపీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు.
Read More: 1. JP Nadda: హైదరాబాద్ నడిబొడ్డులో..కేసిఆర్ కి వణుకు తెప్పించే ప్రకటన చేసిన జేపి నడ్డా..
2.Mudragada Padmanabham: ముద్రగడ సరికొత్త నిర్ణయం.. జగన్ మీద రివర్స్ అవ్వబోతున్నాడా..!
3.AP Employees JAC: ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట..? సంక్రాంతి పండుగ తరువాత మరింత సీరియస్గా…