AP EAPCET: ఏపి ఈఏపి సెట్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 19వ తేదీ నుండి జరగనున్న ఏపి ఈఏపి సెట్ (గతంలో ఎంసెట్) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరానికి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఏపీ ఈఏపిసెట్) నిర్వహణ బాధ్యతను కాకినాడ జేఎన్టీయూకు విద్యాశాఖ అప్పగించింది. జూన్ 25న ఏపిఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దరఖాస్తు నమోదు ప్రక్రియను జూన్ 26 నుండి ఆన్ లైన్ విధానం ద్వారా ప్రారంభించింది. ఈ నెల 19, 20,23,24,25 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు ఉంటాయని పేర్కొన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .. సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ఉంటాయని చెప్పారు.
ఏపి ఈఏపీ సెట్ కు 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వారిలో 1,75,796 మంది అభ్యర్థులు ఇంజనీరింగ్, 83,051 మంది అగ్రికల్చర్ ను ఎంపిక చేసుకున్నారు. 717 మంది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండింటినీ ఎంచుకున్నారు. ఇక ఏపి, తెలంగాణలో ఈ పరీక్షల కోసం 120 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్ పరీక్ష రద్దు చేసినందున ఈఏపీసెట్ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అయితే కోవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినీ విద్యార్ధులను పరీక్షకు హజరు కావడానికి అనుమతి ఉండదని మంత్రి చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలో త్వరలో వెల్లడిస్తామన్నారు. ఆగస్టు 25న ఇంజనీరింగ్ విభాగ ప్రాధమిక కీ విడుదల చేస్తామని మంత్రి సురేష్ వెల్లడించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?