AP EAPCET: ఏపి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్ 2021) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్దిసేపటి క్రితం ఫలితాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ 72,488 (92శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్ల తెలిపారు. ఫలితాలు వెబ్ సైట్ లో పెట్టామన్నారు. మార్కులు, ర్యాంకులు రేపటి నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఈఏపీసెట్ ఆన్ లైన్ లో నిర్వహించడం అనేది ఒక సవాల్ అని, కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. మొత్తం 83,822 మంది విద్యార్థినీ విద్యార్థులు ఏపి ఈఏపీ సెట్ కు ధరఖాస్తు చేయగా 78,066 మంది పరీక్షలకు హజరయ్యారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేష్ టాప్ టెన్ ర్యాంకులను ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా కొరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్ మొదటి ర్యాంకు సాధించినట్లు మంత్రి తెలిపారు. అనంతపురానికి చెందిన శ్రీనివాస కార్తికేయ రెండవ ర్యాంకు, హనుమకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావు మూడవ ర్యాంకు, హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన గజ్జల సమీహనరెడ్డి నాల్గవ ర్యాంకు, ప్రగతినగర్ కు చెందిన కాసా లహరి అయిదవ ర్యాంకు, గుంటూరుకు చెందిన చైతన్య కృష్ణ ఆరవ ర్యాంకు, గుంటూరు జిల్లాకు చెందిన నూతలపాటి దివ్య ఏడవ ర్యాంకు, సిద్దపేటకు చెందిన రాహుల్ సిద్ధార్ధ్ ఎనిమిదవ ర్యాంకు, నల్లగొండ జిల్లాకు చెందిన సాయిరెడ్డి తొమ్మిదవ ర్యాంకు, గుంటూరు జిల్లా కు చెందిన గద్దే విదీప్ పదవ ర్యాంకు సాధించారని మంత్రి సురేష్ వెల్లడించారు. దీనికి సంబంధించి సీడీని మంత్రి సురేష్ విడుదల చేశారు.
Read more:
1.BJP: కర్నాటక బీజేపీలో సంచలనం..! దుమారం లేపుతున్న బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు..!!
2.Big Breaking: తెలంగాణ హైకోర్టులో ఎంపి రఘురామ లంచ్ మోషన్ పిటిషన్..
3.Revanth Reddy: కేసిఆర్ వ్యూహాన్ని పసిగట్టిన రేవంత్ రెడ్డి..! క్యాడర్ కు హెచ్చరికలు..!!