SSC Exams: ఏపిలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టలేదు. రోజు వేల సంఖ్యలోనే కేసులు నమోదు అవుతున్నాయి. లక్షకు పైగా పరీక్షలు కోవిడ్ టెస్ట్ నిర్వహిస్తే 20వేలకు పైగా లక్షల లోపు టెస్ట్ లు నిర్వహిస్తే 20వేలకు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఓ పక్క వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పదవ తరగతి పరీక్షలను ఇతర రాష్ట్రాలకు మాదిరిగానే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతూ అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. పరీక్షలను రద్దు చేసే ఉద్దేశం లేదని, పరీక్షల నిర్వహణ అనేది విద్యార్ధుల భవిష్యత్తు కోసమేననీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే పేర్కొన్నారు.
Read more: CBI: బిగ్ బ్రేకింగ్.. సీబీఐ కొత్త బాస్గా సుబోధ్ కుమార్ జైస్వాల్
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో దాదాపు దేశంలోని 14 రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేశారనీ, సీబీఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని గుర్తు చేస్తూ ఏపిలోనూ పరీక్షల రద్దుకు సూచనలు చేయాలంటూ లోకేష్ రాశారు.
SSC Exams: పరీక్షల నిర్వహణకే మెజారిటీ ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల నిర్వహణపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంలో పరీక్షలను జరపాలనే మెజార్టీ సంఘాలు సూచించాయట. ఉపాధ్యాయుల సూచలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయితే పిల్లల భవిష్యత్తుతో పాటు ఉపాధ్యాయుల భద్రత కూడా ముఖ్యమేనని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదనే అభిప్రాయాన్ని కొన్ని సంఘాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపినందున ఆ దిశగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేక వచ్చే నెల మొదటి వారంలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిపిన తరువాత నిర్ణయాన్ని వెల్లడిస్తుందా వేచి చూడాలి.