ఆంధ్రప్రదేశ్ andhra pradesh లో స్థానిక ఎన్నికల పంచాయతీ local body elections హాట్ హాట్ గా తయారైంది. ఒక పక్క ప్రభుత్వం, మరో పక్క ఉద్యోగ సంఘాలు corona కరోనా వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకూ ఎన్నికలు వద్దంటున్నా ఎన్నికలు జరపకపోతే ఏవో కొంపలు మునిగిపోతున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar ఆదరాబాదరాగా నోటిఫికేషన్ ఇచ్చేశారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశామనీ ఆ తీర్పు వచ్చే వరకూ ఆగమని పదేపదే చెప్పినా ఎవరో మెడ మీద కత్తి పెట్టి ఎన్నికలు నిర్వహించమన్నట్లు ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎంత పట్టుదలతో ఉన్నారో అంత కంటే ఎక్కువ పట్టుదలతో ఎన్నికలు నిర్వహించడానికి వీలులేదని ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంచలన ప్రకటన చేశాయి. “పంచాయతీ ఎన్నిికల ప్రక్రియ ఆపాలి. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం” అంటూ హెచ్చరికలు జారీ చేశాయి. “అవసరమైతే సమ్మె చేసేందుకు కూడా సిద్ధం, ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యం” అంటూ ఏపి ఎన్ జీఓ ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు.
స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కరోనా మహమ్మారితో ఎంతో మంది ఉద్యోగులు, ప్రజలు బలైయ్యారు. ఇప్పుడు కరోనా స్ట్రైయిన్ కేసులు ప్రబలుతున్నాయి అందుకే వ్యాక్సినేషన్ అనంతరం ఎన్నికలు పెట్టాలని కోరుతున్నామన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి విన్నవించినా ఎస్ఈసీ మొండివైఖరితో ముందుకు వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే ఇబ్బందులను వివరిస్తూ ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించామని, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుందని ఆయన అన్నారు. ఈ లోపుగానే ఎన్నికల సంఘం హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేసిందనీ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఎన్నికల నిర్వహణ అవసరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
2018లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఇప్పటి వరకూ నిర్వహించలేదు. రెండున్నరేళ్లుగా జరగని ఎన్నికలు మరో రెండు మూడు నెలలు ఆగితే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నాము కానీ హడావుడిగా ఎన్నికలు నిర్వహించి ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు తీసుకురావాలని హైకోర్టు కూడా చెప్పలేదన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికల తరువాత కరోనా కేసులు పెరిగాయని ఆ భయంతోనే ఎన్నికలను బాయ్ కాట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు చంద్రశేఖరరెడ్డి. సోమవారం నుండి ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులను బాయ్ కాట్ చేస్తే ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయి ఎన్నికలు క్యాన్సిల్ అవుతాయేమో చూడాలి మరి. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉండి మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగులు తిరుగాడుతుండగా కరోనా భయం అంటూ కారణం చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రకటనలు ఇవ్వడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.