AP Employees Shocked: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల జీపీఎఫ్ ఖాతాల నుండి మరో సారి నిధులు మాయం అయ్యాయి. గతంలోనూ జీపీఎఫ్ ఖాతాల్లో నగదు ఉద్యోగులకు తెలియకుండానే మాయం అయితే ఫిర్యాదు చేస్తే తిరిగి వేశారు. ఇప్పుడు మరో సారి మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన జీపీఎఫ్ ఖాతాల నుండి 800 కోట్ల రూపాయలు డెబిట్ అయ్యాయి. ఈ విషయాన్ని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ మంగళవారం మీడియాకు తెలిపారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుండి డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్లు గత రాత్రి నుండి మెసేజ్ లు వచ్చాయన్నారు సూర్యనారాయణ. తన వ్యక్తిగత ఖాతా నుండి రూ.83వేలు విత్ డ్రా చేశారని ఆయన చెప్పారు. జీపీఎఫ్ ఖాతాల్లో నగదు ఎవరు తీసుకున్నారో తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామన్నారనీ, గడచిన ఆరు నెలలుగా ఇచ్చిన డీఏ బకాయిలు మళ్లీ వెనక్కు తీసుకున్నారని ఆరోపించారు సూర్యనారాయణ.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Employees Shocked: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్టేషన్ లలో ఫిర్యాదు..?
జీపిఎఫ్ ఖాతాలో నగదు విత్ డ్రా అంశంపై ఆర్ధిక శాఖకు ఫిర్యాదు చేయడానికి వెళితే అధికారులు అందుబాటులో లేరని సూర్యనారాయణ తెలిపారు. ఇవి ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నాయా లేక ఉన్నతాధికారుల తప్పిదమో తెలియడం లేదని అన్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండా వారి ఖాతాలోని సొమ్ము విత్ డ్రా చేయడం నేరమని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు సూర్యనారాయణ. ఇదే సందర్భంలో మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు సూర్యనారాయణ. ఆర్దిక శాఖలోని సీఎఫ్ఎఎస్ లో ఉన్న సీపీయూ యూనిట్ వద్ద తమ వేతన ఖాతాల నుండి విత్ డ్రా చేసే సాంకేతికత ఉందనీ, ఇది ఎంత వరకు చట్టబద్దమని ఆయన ప్రశ్నించారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు సూర్యనారాయణ.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?