AP Exams : ఏపిలో ఓపెన్ స్కూల్స్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యుల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. జూన్ 21 నుండి 28వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ ను మంత్రి సురేష్ విడుదల చేశారు.
జూన్ 21వ తేదీ పదవ తరగతి విద్యార్థులకు తెలుగు, జూన్ 22వ తేదీ ఇంగ్లీషు, 23వ తేదీ లెక్కలు, భారతీయ సంస్కృతి మరియు వారసత్వం, 24వ తేదీ శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం, గృహ విజ్ఞాన శాస్త్రం, 25వ తేదీ సాంఘీక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, 26వ తేదీ హిందీ, 28వ తేదీన బిజినెస్ స్టడీస్, మనో విజ్ఞాన శాస్త్రం అన్ని వృత్తివిద్యా సబ్జెక్టులు
ఇంటర్మీడియట్ విద్యార్థులకు
జూన్ 21వ తేదీ హిందీ/ తెలుగు/ ఉర్దూ, 22వ తేదీ ఇంగ్లీషు. 23వ తేదీ గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం, 24వ తేదీ భౌతిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం/ పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, 25వ తేదీ రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, 26వ తేదీ జీవశాస్త్రం, వాణిజ్య /వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం, 28వ తేదీ అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులు
కాగా ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలకు జూన్ 29 నుండి జూలై 4వ తేదీ వరకూ ఆదివారంతో సహా జరుగుతాయని మంత్రి సురేష్ తెలిపారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?