NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Finance ministry: రూ.41వేల కోట్ల లేక్కల తేడా ఆరోపణపై ఏపి ఆర్ధిక శాఖ వివరణ ఇదీ..!!

AP Finance ministry: ఏపి ఆర్ధిక శాఖలో రూ.41వేల కోట్ల ఖర్చులకు లెక్కలు లేవని పీఎసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించడంతో పాటు దీనిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నిన్నటి నుండి ఈ అంశంపై మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్థిక శాఖలో 40వేల కోట్ల ఖర్చులకు లెక్కలు లేవు అనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆర్ధిక శాఖ లో చెల్లింపులు అన్నీ నిబంధనలకు లోబడే పద్దతి గానే జరుగుతున్నాయని తెలిపింది.

AP Finance ministry responds to Payyavula Keshav complaint
AP Finance ministry responds to Payyavula Keshav complaint

Read More: YS Viveka Case; మూలాలు కదులుతున్నయ్..! వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు..!!

కాగ్ లేవనెత్తిన అంశాలను ఉదహరిస్తూ పీఎసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆర్ధిక శాఖ జమా ఖర్చుల్లో భారీ తేడాలు ఉన్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్ధిక శాఖ పేర్కొంది. ప్రతి ఏటా ప్రిన్సిపల్ ఎకౌంటెంట్  జనరల్ తాము చూసిన అబ్జర్వేషన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని, అందులో భాగంగానే మే 4న తమకు లేఖ వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ లేఖపై ఇప్పటికే వివరణ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. స్పెషల్ బిల్స్ క్యాటగిరి కింద రూ.10వేలకు పైగా బిల్లులకు సంబంధించి 41వేల కోట్లు డ్రా చేసిన విషయంపై కాగ్ కు ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆడిట్ అభ్యంతరాలు కేవలం అడ్జస్ట్‌మెంట్ లో జరిగిన పొరపాట్లు మాత్రమేనని చెప్పారు.

పిడీ అకౌంట్స్ కు విడుదల చేసిన నిధులకు సంబంధించి ఆర్ధిక ఏడాది చివరకి అవి ఉపయోగించుకోలేకపోవడం వల్ల అవి ల్యాప్స్ అయ్యాయనీ, అవి చూపించకపోవడం వల్ల లెక్కల్లో తేడా రావడానికి కారణంగా వివరణ ఇచ్చారు. పీడీ అకౌంట్స్ మధ్య అడ్జస్ట్ మెంట్స్ కూడా చేశామనీ, దాని వల్ల కూడా తేడా కనిపించిందని పేర్కొన్నారు. ఫెయిల్ అయిన చెల్లింపులకు సంబంధించి మళ్లీ చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యకు మరో కారణంగా చెప్పారు. జీఎస్టీఐఎన్ఐ లో రెగ్యులర్ బిల్లులకు టీడీఎస్ అడ్జస్ట్ మెంట్ రికవరీ లో కూడా తెడాలు ఉన్నాయనీ, ఈ పొరబాట్లపై కాగ్ కు వివరణలు ఇవ్వడం జరిగిందని వివరణ ఇచ్చారు.

 

 

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?