NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Floods: ఏపి సీఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ ..! రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా..!!

AP Floods: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా భీభత్సకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. అనంతపురం జిల్లా చిత్రావతి నది వరద ఉగ్రరూపు దాల్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నేడు ఎంపి సీఎం వైఎస్ జగన్ కు ఫోన్ చేశారు. ఏపిలో వర్షాలు, వరదల పరిస్థితులపై ప్రధాన మంత్రి మోడీ ఆరా తీశారు. నిన్నటి నుండి ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల గురించి సీఎం జగన్ ను పీఎం మోడీ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ చర్యల గురించి, అయిదు జిల్లాల్లో వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధాని మోడీకి సీఎం జగన్ వివరించారు. ఈ సందర్భంలో కేంద్రం నుండి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని ప్రధాని మోడీ సీఎం జగన్ కు హామీ ఇచ్చారు. ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం జగన్ వివరించారు. సహాయక చర్యల కోసం నావీ హెలికాఫ్టర్ లను కూడా వినియోగించుకుంటున్నట్లు ప్రధాన మంత్రి మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకువచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా పలు జిల్లాల్లో చెరువులకు గండ్లు పడుతున్నాయి. వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకువచ్చారు.

AP Floods: PM Modi phone call to ap cm ys jagan over flood situation
AP Floods PM Modi phone call to ap cm ys jagan over flood situation

AP Floods: కడప జిల్లాలో భారీ ప్రాణనష్టం

భారీ వర్షాల కారణంగా కడప జిల్లా రాజంపేట లో భారీ ప్రాణనష్టం జరిగింది. నందలూరు పరివాహక ప్రాంతంలో గల మందపల్లి, ఆకేపాడు, నందలూరు ప్రాంతాల్లో మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుని సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల్లో 12 మృతదేహాలను వెలికితీశారు. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతు అవ్వగా నదిలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. అయితే కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం పది మంది తిరిగి బయటకు వచ్చే పరిస్థితి లేక నదిలోనే ఓ జేసీబీపైనే ఉండిపోయారు. ఈ విషయం అసెంబ్లీ సమావేశంలో ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి తెలియడంతో వెంటనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణం స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లా కు హెలికాఫ్టర్ పంపాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అక్కడకు హెలికాఫ్టర్ చేరుకుని చిత్రావతి నదిలో చిక్కుకున్న పది మందిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?