జగన్ సర్కార్ మరో సలహాదారుడి పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపి ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్న సీనియర్ జర్నలిస్ట్ దేవురపల్లి అమర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఏపి సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాల రాజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఏపి సీఎం గా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలువురిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన సంగతి తెలిసిందే.
Read More: 15 నుండి ఏపి అసెంబ్లీ సమావేశాలు .. ఈ సమావేశాల్లో పకడ్బందీగా మూడు రాజధానుల బిల్లు..?
అందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్, అప్పటి వరకూ సాక్షి టీవీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన దేవురపల్లి అమర్ ను రాష్ట్ర ప్రభుత్వ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా నియమించారు. అప్పట్లోనే అమర్ నియామకంపై విమర్శలు వచ్చాయి. ఏపిలో ఎంతో మంది సీనియర్ జర్నలిస్ట్ లు ఉండగా, ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు తెలియజేసిన అమర్ కు ఈ నామినేటెడ్ పదవిలో ఏపి సర్కార్ నియమించడంపై ఆయన వ్యతిరేకుల నుండి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. అయితే ఇప్పుడు అమర్ పదవీ కాలం ముగియడంతో మరో సంవత్సరం పొడిగించింది ప్రభుత్వం.
Read More: చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన..భారీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..ఎప్పుడంటే..?