Vangaveeti Radha Krishna: తనపై రెక్కి నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయిన విషయం తెలిసిందే. రాధాకృష్ణ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. వివాదరహితుడైన రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించి ఉంటారు. ఇది వాస్తవమేనా కాదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే రాధా చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. వంగవీటి రాధా కు సెక్యురిటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధా చెప్పిన అంశాలకు సంబంధించి ఆధారాలను సేకరించి నివేదిక సమర్పించాలని డీజీపీ గౌతం సవాంగ్ ను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. 2 ప్లస్ 2 గన్ మెన్ ల సెక్యురిటీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకు సెక్యురిటీ
వంగవీటి రాధాకృష్ణ 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడుగా రాధాకృష్ణకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. నిన్న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో రాధ తో పాటు వైసీపీకి చెందిన మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. పార్టీలు వేరైనా వీరు ముగ్గురు తొలి నుండి సన్నిహితులు, స్నేహితులు. ఆదివారం జరిగిన కార్యక్రమాల్లో వంగవీటి రాధాకృష్ణ తనపై రెక్కీ నిర్వహించారనీ, త్వరలో అన్ని విషయాలు బయటపెడతాను అని చెప్పారు. తాను ఇటువంటి వాటికి భయపడే వ్యక్తిని కాదనీ, తన తండ్రి రంగా ఆశయ సాధన కోసం ప్రజల్లోనే ఉంటానని పేర్కొన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం సెక్యురిటీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?