AP Government: రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు ఆగస్టు 16 నుండి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాలలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ అక్కడక్కడా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ఈ తరుణంగా విద్యార్థుల సౌలభ్యంలో ఆ విద్యాసంవత్సరానికి సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. మూడవ తరగతి నుండి పదవ తరగతులకు సిలబస్ తగ్గించింది. 3 – 9 తరగతుల వరకూ 15 శాతం, పదవ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది. పాఠశాల పని దినాల అకడమిక్ కేలండర్ ను ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు తెలిపారు.
AP Government: గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు రద్దు
పదవ తరగతి ఫలితాల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో 2010లో అప్పటి ప్రభుత్వం మార్కుల హడావుడిని తగ్గించి గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఎక్కువ మందికి ఒకే గ్రేడ్లు వచ్చినప్పుడు పలు నియామకాల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.
2019 మార్చి వరకూ విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ లు ఇచ్చారు. ఇకపై మార్కులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదవ తరగతి లో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. దీంతో అంతర్గతంగా పరీక్షల విధానం నుండి మార్కులు తీసుకని ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహించాలని తొలుత భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం తెలిపింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్ వ్యవస్థనే రద్దు చేసింది. తిరిగి మార్కులు విధానాన్ని తీసుకువచ్చింది.
1.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!
2.Tammineni Vs Darmana: మారుతున్న సీక్కోలు రాజకీయం .. ! తమ్మినేని, ధర్మాన లో మంత్రి పదవి ఎవరికి.?.
3.AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు..