Vaccination: కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై అధికంగా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపి సర్కార్ అప్రమత్తం అయ్యింది. ఏపిలో అయిదేళ్లలోపు చిన్నారుల తల్లులందరికీ వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అర్హులైన తల్లులకు టీకా వేయించాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారిగా జాబితాను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన వారికే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పిల్లల తల్లులకు టీకాలు అందించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్హులైన తల్లులందరికీ ఒక రోజ ముందుగానే టోకెన్ లు పంపిణీ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది.
టోకెన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు ద్వారా వారిని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి టీకా వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో అర్హులైన తల్లులు 15 నుండి 20లల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంచనా. వీరందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.