అనంతపురం ప్రజలను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పట్టణ శివారులో ప్రమాదం పొంచి ఉంది. కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకు గండి కొట్టడంతో ఆ నీరు అంతా ఊరిలోకి వచ్చి పడింది. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అనంతపురం ప్రాంతంలో గతంలో ఎన్నడూ ఇంత వరద చూడలేని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలివెళుతున్నారు. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేట పంచాయతీలోని అయిదు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరద పోటెత్తడంతో కాలనీల్లో అయిదు అడుగుల మేర నీరు చేరుకుంది.
అనంతపురం భారీ వర్షాలు, వరదల పై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్.. బాధిత కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయంగా అందించాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులైన వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు రూ.2వేల తక్షణ సాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించాలని సూచించారు. వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టం పై అంచనాలు వేసి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఏపి సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసించిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్.. ఎందుకంటే..?