ఏపిలోని పలు ప్రాంతాల్లో మాండూస్ తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దాదాపు ఆరు జిల్లాల్లో తుఫాను అతలాకుతలం చేసింది, వాగులు, వంకలు పొంగిపొర్లటం, భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మిగతా జిల్లాల్లోనూ ఒక మోస్తరు వర్షాలు పడ్జాయి.
ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుఫాను ప్రభావం చూపింది. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల నుండి 708 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. తుఫానుపై ఇప్పటికై రెండు మూడు పర్యాయాలు అధికార యంత్రాంగంతో సమీక్షలు జరిపిన సీఎం జగన్మోహనరెడ్డి తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణం సహాయం అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో తుఫాను బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఒక్కరికి రూ.1000లు,, కుటుంబానికి గరిష్టంగా రెండు వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించింది ప్రభుత్వం. పునరాావాస కేంద్రాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలోనే ఈ ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లోని బాధితులకు ఆర్ధిక సాయం అందించాలని ఉత్తర్వులో పేర్కొంది.
Janasena: జనసేనకు ఆర్టీఏ అధికారులు షాక్ .. వారాహి రిజిస్ట్రేషన్ తిరస్కరణ
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?