NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Governor Abdul Nazeer: జీఎస్‌డీపీలో దేశంలోనే అగ్రగామిగా ఏపీ

AP Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారిగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలి సారి శాసనసభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన ప్రసంగంలో వివరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తొందని అన్నారు. రాష్ట్రంలో నవరత్నాలతో సంక్షేమ పాలన అందుతోందని చెప్పారు. డీబీటీ ద్వారా అవినీతి లేకుండా నేరుగా లబ్దిదారులకే సొమ్ము అందిస్తున్నామని తెలిపారు.

AP Governor justice abdul nazeer addressed both houses for the first time

 

వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నట్లు గవర్నర్ చెప్పారు. రాష్ట్ర అర్ధిక పరిస్థితి నాలుగేళ్లలో మెరుగుపడిందని అన్నారు. జీఎస్డీపీలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు.  ఏపిలో తలసరి ఆదాయం 2.19 లక్షలకు పెరిగిందన్నారు. విద్యా, వైద్య రంగంలో సమూలమైన సంస్కరణలు తెచ్చామన్నారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మెరుగుపర్చడమే కాకుండా సేవలలో మరింత నాణ్యత పెంచామని తెలిపారు. విద్యార్ధులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మార్పులు తీసుకువచ్చామని గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. పేద వారికి ఉచిత వేద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయిస్తునన్నామన్నారు.

కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు. వైద్య రంగంలో మెరుగైన సేవలందించేందుకు పోస్టులను భర్తీ చేశామన్నారు. కొత్తగా 15 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల నుండి నర్సుల వరకూ అన్ని పోస్టులు భర్తీ చేస్తూ వస్తున్నామన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యిందన్నారు. ఈ సదస్సు ద్వారా రూ.11.50 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలు కుదుర్చుకున్నామని దీని ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని గవర్నర్ తెలిపారు.  గ్రామ వార్డు సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన అందిస్తున్నట్లు గవర్నర్ వివరించారు.

ఎంపీ అవినాష్ వినతిని తిరస్కరించిన సీబీఐ .. నాల్గవ సారి విచారణకు హజరైన అవినాష్ రెడ్డి

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!