AP Governor: అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువయ్యేలా ప్రభుత్వం పని చే్స్తుందని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేసి బాయ్ కాట్ చేసి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుపై సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన ప్రారంభం కానుందని చెప్పారు. వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపీ వృద్€ధి జరిగిందన్నారు. ఉద్యోగులకు ఒకే సారి అయిదు డీఏలు విడుదల చేశామని గవర్నర్ తెలిపారు. 11వ పీఆర్సీ అమలు, రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచామన్నారు. తలసరి ఆదాయం 15.87 శాతం పెరిగి రూ.2,04,758కి చేరిందన్నారు. నవరత్న పథకాల ద్వారా మానవ, ఆర్ధిక అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. నాడు – నేడు, ఆరోగ్యశ్రీ, బాలామృతం అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మూడు వాయిదాలో ఆర్ధిక సాయం అందించామన్నారు.
వైెఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి పదివేల వంతున ఇస్తున్నామన్నారు. రూ.770 కోట్లు సాయం చేశామన్నారు. స్యయం సహాయక సంఘాలకు రూ.12,758 కోట్లు కేటాయించినట్లు గవర్నర్ తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందుతున్నాయన్నారు. పారదర్శక, అవినీతి రహిత పాలన అందిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రేపటికి వాయిదా పడింది.