Teachers Day Celebration: భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకుని ప్రతి ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ (గురుపూజోత్సవం) వేడుకలు జరుపుకోవడం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో గురుపూజోత్సవ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ లోకం ఆక్షేపణ వ్యక్తం చేస్తుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయన్న కారణంతో గత నెల 16 నుండి రాష్ట్రంలో పాఠశాలలను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కోవిడ్ పేరు చెప్పి గురుపూజోత్సవ వేడుకలను రద్దు చేయడం అన్యాయమని ఏపి ప్రభుత్వ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని ఉపాధ్యాయులు అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు వివిధ శాఖల ఉద్యోగులకు అవార్డులు అందజేశారనీ, అప్పుడు లేని కోవిడ్ నిబంధనలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నెపంతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని రద్దు చేసి వారి ఉత్సాహాన్ని నీరు గార్చారని అన్నారు. ఉపాధ్యాయుల ఆవేదనను అర్థం చేసుకుని గురుపూజోత్సవాన్ని నిర్వహించాలనీ, దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించాలన్నారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అక్టోబర్ 5వ తేదీన జరిగే అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజునైనా నిర్వహించాలనీ, వీలుకాకపోతే ఆన్ లైన్ ద్వారా గురుపూజోత్సవం ఖశ్చితంగా నిర్వహించాలని సీఎం జగన్మోహనరెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Read More:
1.PDS Rice: ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు..!!
2.YS Vijayamma: విజయమ్మ మాస్టర్ ప్లాన్..! అందరూ ఉద్దండులే..! ఆ మాత్రం ఊహించలేరా..!!
3.Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..