ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు ముగుస్తున్న నేపథ్యలో మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఇవేళ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధుల ప్రణాళిక, కేటాయింపు, వినియోగం చేయనున్నది.
ఎస్సీ , ఎస్టీ సబ్ ప్లాన్ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం ఏపీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను మరో 10 ఏళ్ల పాటు పొడిగించిందన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రతిదీ సూటిగా, నిజాయితీగా, పారదర్శకంగా మళ్లింపులు లేకుండా ఉంటాయని అన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి.
Read More: ఏపి పరిపాలనా రాజధాని మూహూర్తం ఫిక్స్ అయినట్లే(గా)..! ఎప్పుడంటే..?