AP Govt: ఏపిలో ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీ గడువును ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ పెంచింది. ముందు ఈ నెల 17వ తేదీ వరకే బదిలీలపై ప్రభుత్వం నిషేదం ఎత్తివేసింది. అయితే కొన్ని శాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం అందింది. ఉద్యోగుల బదిలీల గడువు పెంచాలని సీఎం జగన్ కు పలు ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగుల బదిలీల గడువును నెలాఖరు వరకూ పెంచుతూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏపిలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ వరకూ పది రోజులు మాత్రమే బదిలీలపై నిషేదం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. అయిదేళ్ల పైబడిన ఉద్యోగులకు బదలీ అవకాశం కల్పించింది. వ్యక్తిగత వినతులు, పరిపాలనా సౌలభ్యం ఆధారంగా కూడా బదిలీలు జరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేయలేదు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ తరుణంలో ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులకు పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం బదిలీలపై నిషేదాన్ని కేవలం పది రోజులు మాత్రమే ఎత్తివేయడం వల్ల వివిధ శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడంతో ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పించింది.