AP Govt: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. 190 పేజీలతో కూడిన ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం పలు కీలక అంశాలను పేర్కొంది. ప్రధానంగా రైతులకు అందించనున్న ప్లాట్లలో పనులు పూర్తి చేసి నెలరోజుల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశంపై ఈ అఫిడవిట్ లో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
AP Govt: అమరావతిలో పనులకు 2024 జనవరి వరకూ గడువు
మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టు గత నెల 3వ తేదీన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్నందున ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అమరావతిలో పనులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం మరో నాలుగు సంవత్సరాలు పొడిగించిందని సీఎస్ సమీర్ శర్మ అఫిడవిట్ లో పేర్కొన్నారు. రైతుల ప్లాట్ల లతో సహా ఇతరత్రా వాటికి తమకు 2024 జనవరి వరకూ గడువు ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.