ఏపిలోని విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 18 సంవత్సరాలుగా నెలకొన్న సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏపి ట్రాన్స్ కో, ఏపి జెన్ కో తో పాటు ఏపి తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లలోని ఉద్యోగులు ఒక సంస్థ నుండి మరో సంస్థకు బదిలీ అయ్యే వెసులుబాటును కల్పించింది. ఈ తరహా బదిలీలపై 2005లో బ్యాన్ విధించడంతో అప్పటి నుండి ఇప్పటి వరకూ ఏ సంస్థలో పరిదిలోని వారు ఆ సంస్థ పరిధిలోనే బదిలీ అవుతున్నారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆ సంస్థ పరిధిలోని జిల్లాల్లోనే బదిలీ అవుతున్నారు. తాజాగా కల్పించిన వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగులు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు బదిలీ కోరుకునే అవకాశం ఏర్పడింది.
ఈ బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు గానూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయనానంద్ తాజాగా ఏపీ ట్రాన్స్ కో హెచ్ ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గా ఒక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ లోగా సిబ్బంది తమ బదిలీ అభ్యర్ధనలను హెచ్ఆర్ కమిటీకి సమర్పించాల్సి ఉంటుందనీ, నిబంధనల ప్రకారం దరఖాస్తు ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. తదుపరి ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి.
సజ్జల: షర్మిల కోసమా..! కేసిఆర్ కోసమా..! ఈ మౌనం వెనుక అర్ధం ఏమిటి..?