Flash..Flash: దేశంలో రేషన్ కార్డుదారులకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2023 వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తూ ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఏపిలో ఇప్పటి వరకూ రెగ్యులర్ పీడీఎస్ బియ్యం, కందిపప్పు, పంచదార పంపిణీలను ఎండియూ ఆపరేటర్ ( డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా పంపిణీ జరుగుతుండగా, ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని గతంలో మొత్తం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేయగా, గత నాలుగైదు నెలల నుండి కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం సరఫరా చేస్తుండగా, మిగిలిన స్టేట్ కార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని భరాయించి గతంలో పంపిణీ చేసింది. అయితే ఇది రాష్ట్రానికి మరింత ఆర్ధిక భారం కావడంతో కేంద్ర ప్రభుత్వ అనుమతితో కేవలం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వచ్చారు. కొంత మందికి మాత్రమే ఉచిత బియ్యం ఇస్తూ మరి కొందరికి ఇవ్వకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో వచ్చే నెల జనవరి నుండి డిసెంబర్ వరకూ మొత్తం రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని సమచాారం.
రెగ్యులర్ పీడీఎస్ బియ్యం పంపిణీ నిలుపుదల చేసి పీఎంజీకేఏవై ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార (డబ్బులకు) ను రేషన్ కార్డుదారులకు ఎండియు (డోర్ డెలివరీ వ్యాన్) ఆపరేటర్ ల ద్వారా పంపిణీ చేయన్నారని తెలుస్తొంది. రాష్ట్రంలో మొత్తం 1,45,43,997 రేషన్ కార్డులు ఉండగా, వాటిలో 90,27,636 ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు ఉన్నాయి. గత నాలుగైదు నెలల నుండి ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకు మాత్రమే ఉచిత బియ్యం విడుదల చేస్తూ వస్తున్నారు. పీఎంజీకేఏవై స్కీమ్, రెగ్యులర్ పీడీఎస్ కోటా లను కలిపి ఒకే పథకం గా మార్పు చేసి 2023 జనవరి నెల నుండి మొత్తం రాష్ట్రంలోని కార్డుదారులకు ఎండీయు ఆపరేటర్ ల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నదని సమాచారం. ఢిల్లీ టూర్ లో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం ఈ ప్రతిపాదనపై ఆమోదం తీసుకుని జనవరి నుండి అమలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల రావాల్సి ఉంది.
Gram Panchayat sarpanches: ఇప్పుడు తెలంగాణలో స్టార్ట్ అయ్యింది .. రేపు ఏపికీ పాకుతుందా..?