AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధుల నిర్వహణకు ప్రభుత్వం 2019 అక్టోబర్ నుండి లక్షా 34 మంది గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించింది. వీరు సర్వీసులో చేరి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అందించింది.
సర్వీసులో చేరి రెండేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు ప్రొబేషన్ ప్రకటించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం డిపార్ట్ మెంటల్ టెస్ట్ ను ప్రభుత్వం నిర్వహించింది. 2019 అక్టోబర్ నుండి 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు పని చేస్తున్నారనీ, ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి అవుతుందని వారికి ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా ఆయా శాఖల అధికారుల నుండి డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబంధించి వివరాలు సెకరించాలని సూచించారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, వెల్పేర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేయర్ లు, మహిళా పోలీస్, ఎఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డిపార్ట్ మెంటల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ప్రొబేషన్ ప్రకటించనున్నారు డిపార్ట్ మెంటల్ టెస్ట్ రాయని ఉద్యోగులకు మరల టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
Read More:
1.Ganesh Festival: ఏపిలో హాట్ టాపిక్గా గణేష్ ఉత్సవాల రగడ..! నేడు గవర్నర్కు బీజేపీ నేతల ఫిర్యాదు..!!
2.AP High Court: ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలపై ఏపి హైకోర్టు కీలక తీర్పు..!!
3.Supreme Court: సీబీఐపై జస్టిస్ ఎన్వీ రమణ ఉగ్రరూపం..! తీవ్ర ఆగ్రహం..! సీబీఐ డైరెక్టర్ కు నోటీసులు..?