AP Govt: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ (IAS) అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ఏపి సర్కార్ (AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్య కార్యదర్శులుగా ఉన్న ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు స్పెషల్ సీఎస్ లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో కే విజయానంద్, బుడితి రాజశేఖర్, ఎస్ఎస్ రావత్ లు ఉన్నారు. ఈ ముగ్గురు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. కే విజయానంద్ ఏపి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, రావత్ ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?