AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. సూపర్ టైమ్ స్కేల్ ప్రకారం ఐపీఎస్ లకు జీతాలు పెంచుతూ ఏపి ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుగురు ఐపీఎస్ లకు డీజీ హోదా కల్పించింది. 1990,1991, 1992 బ్యాచ్ అధికారులు అంజన సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహమ్మద్ హసన్ రైజా, హరీకుమార్ గుప్తా, పి సీతారామ ఆంజనేయులు, కాశిరెడ్డి విఆర్ఎన్ రెడ్డి, నలిన్ ప్రభాత్ లకు డీజీ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరిలో మాదిరెడ్డి ప్రతాప్ ఏపి డిసార్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డీజీగా పదవీ విరమణ చేయనుండగా, ఎండి హసన్ రైజా జైల్స్ డీజీగా, హరీష్ కుమార్ కుమార్ గుప్తా ఏపి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా, పి సీతారామ ఆంజనేయులు ఏసీబీ డీజీగా, కాసిరెడ్డి విఆర్ఎన్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీగా పదవీ విరమణ అవుతున్నారు. ఇక అంజన సిన్హా, నలీన్ ప్రతాప్ సెంట్రల్ డిప్యూటిషన్ లో డీజీ హోదాలో కొనసాగనున్నారు.