ఏపిలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దారిద్య్ర రేఖకు దిగువ ఉండి తెలుపు రంగు రేషన్ కార్డు కల్గి ఉన్నా సంక్షేమ పథకాలను అందుకోలేని పేద వర్గాలకు లబ్ది చేకూరనున్నది. పేద వర్గాలకు చెందిన కుటుంబంలోని కుమారుడు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం వచ్చి వేరే ఊరు వెళ్లిపోయినా వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వారు ప్రభుత్వ ఉద్యోగి గా లేదా ఆదాయపన్ను చెల్లింపు దారుడుగా ఉండటంతో వారి తల్లిదండ్రులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనర్హులుగా మారుతున్నారు. ఇటీవల కొన్ని సామాజిక పెన్షన్లు నిలిచిపోవడానికి కూడా కారణం ఇదేనంటున్నారు.
రేషన్ కార్డులో పేరు లేకపోయినా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అందరూ ఒకటిగా ఉండటంతో వారి తల్లిదండ్రులు పలు సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. అనర్హులుగా మారుతున్నారు. దీంతో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 2019 లో సేకరించిన నవశకం సర్వే లోని డేటాలో కుటుంబ సభ్యుల వివరాల్లో మార్పులు, చేర్పులకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వివాహం జంటలను సర్వేలో ఒకే కుటుంబంగా చూపిస్తున్నా వారు ప్రస్తుతం వేర్వేరుగా నివాసం ఉంటుంటే ఆయా కుటుంబాలను వర్గీకరించేందుకు అవకాశం కల్పించింది. ఈ రోజు (మంగళవారం) నుండి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ సేవలను పొందవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్షేమ పథకాలు అందని పేద వర్గాలకు ఇకపై న్యాయం జరగనుంది. దీంతో ఆ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే వారు సంక్షేమ పథకాలు పొందేందుకు ధరఖాస్తులు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
Medak car fire accident case: అతని చావు తెలివి చచ్చుబండలైంది