Guntur Case: ఇటీవల గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో రమ్య బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జగన్మోహనరెడ్డి సర్కార్ తక్షణం స్పందించింది. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన జరిపి నిందితుడిని శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సత్వర న్యాయ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నది. ఈ విషయాన్ని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత నేడు వెల్లడించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి సుచరిత ప్రభుత్వం తరపున కేటాయించిన అయిదు సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. రమ్య సోదరికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామనీ, అదే విధంగా అయిదు ఎకరాల సాగు భూమిని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
కాగా మేడికొండురు మండలం పాలడుగు వద్ద జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ దశలో పూర్తి వివరాలు వెల్లడించలేమని మంత్రి సుచరిత అన్నారు. పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయనీ, త్వరలో నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతారని ఆమె అన్నారు.
Read More:
2.Kakinada Municipal corporation: కాకినాడలో వైసీపీ కీలక అడుగులు..! మేయర్ పీఠంకు కౌంట్ డౌన్..!!