Ap Govt: ఏపి ప్రభుత్వం ఇటీవల కాలంలో బ్లాంక్ జీవోల జారీ చేయడంపై ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేతల బృందం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కొన్ని కాన్ఫిడెన్షియల్ పేరుతో జివోలు విడుదల చేయడం పరిపాటే. గతంలో టీడీపీ హయాంలో ఇలానే జీవోలు విడుదల చేస్తే వైసీపీ నేతలు నాడు టీడీపీ ప్రభుత్వాన్ని తప్పు బట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనూ ఎక్కువ సంఖ్యలో బ్లాంక్ జీవోలు విడుదల చేయడంపై టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్ లైన్ లో పెట్టే విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్ లైన్ లో పెట్టకూడదని నిర్ణయించింది. జివోలను ఆఫ్ లైన్ లోనే పెట్టేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను అనుసరిస్తూ ఆన్ లైన్ లో జీవోలను ఉంచడాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు ఉత్తర్వులో పేర్కొంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2008 వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుండి ఏపి ప్రభుత్వం ప్రజల కోసం జీవోలను ఆన్ లైన్ లో ఉంచుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?