AP Govt : ఏపి ప్రభుత్వానికి కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రావడం సర్వసాధారం అయిపోయింది. ఇటీవల కాలం వరకూ ఏపి హైకోర్టు నుండే అనుకుంటే సుప్రీం కోర్టులోనూ వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కోర్టుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించలేకపోవడా ? నిర్ణయాలు తీసుకునే సమయంలో అధికారులు నిబంధనలు పాటించకపోవడమా? అనే విషయాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
గత నెలలోనే స్థానిక ఎన్నికలకు సంబంధించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేయగా ఇప్పుడు తాజాగా పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం అన్న ఎన్ జీ టీ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. ఎన్ జీ టీ తీర్పులో జోక్యం చేసుకోవానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం పై ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై సోమవారం జస్టిస్ రోయింగ్ టన్ నారిమన్, జస్టిస్ అనిరుధ్ బోస్ ల కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంలో పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదనీ ఏపి ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదనలు విపించారు. పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని వివరించారు. విశాఖ పట్నం నగరానికి తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా అందుతుందని అన్నారు. కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వాదనలు వినిపించారు. బాధిత రైతుల తరపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వివరించారు.
పోలవరం ప్రాజెక్టుకు 2006లో పర్యావరణ అనుమతులు రాగా పురుషోత్తమపట్నం ప్రాజెక్టు పనులు 2016- 17లో చేపట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయలేదని అన్నారు. రైతుల నుండి తీసుకున్న భూములకు ఇంకా పరిహారం ఇవ్వలేదని కోర్టుకు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్ జీటీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. మెరిట్స్, డీ మెరిట్స్ చూసుకుని ముందడుగులు వేస్తే ఇటువంటి పరిస్థితులు రావని అంటున్నారు పరిశీలకులు.