AP Govt: ఏపి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసు విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను ఏపి ప్రభుత్వం గౌరవించింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఏపి ప్రభుత్వం. ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ జీవో జారీ చేశారు. ఫిబ్రవరి 8 నుండి సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Govt: టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసి..
ఏపి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ పై ఆయన క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను ఎత్తివేయాలని, విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీం కోర్టు ఆదేశాలతో సస్పెన్షన్ ఎత్తివేత
అయితే ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టులో ఏబీ వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైకోర్టు తీర్పును సమర్ధించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనను విధుల్లోకి తీసుకోవాలంటూ ఇటీవల ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. రెండు పర్యాయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మను కలిసేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రయత్నం చేసినా సీఎస్ అపాయింట్మెంట్ లభించలేదని వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం ఆయన సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీవో విడుదల చేసింది. జీఏడికి రిపోర్టు చేయాలని ఏబీ వెంకటేశ్వరరావుకు ఉత్తర్వులను ప్రభుత్వం పంపింది.