NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

SEC ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ పై ప్రభుత్వ స్పందన

 

ఏపి Andhra Praseshలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయక ముందే రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాధ్ దాస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్ ఎస్ఈసీతో భేటీ అయి స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలను తెలియజేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ కుదరని స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఈ ముగ్గురు అధికారులు ఎస్ఈసీని కలిసి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహరించే అవకాశం ఉందని తెలియజేశారు.

ap govt reaction on sec election schedule
ap govt reaction on sec election schedule

అయితే ప్రభుత్వ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ గంటల వ్యవధిలోనే ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించడాన్ని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికార దురహంకారంతో నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఘాటుగా విమర్సించారు. గతంలోనూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేశారనీ, ఇప్పుడు కూడా ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషనర్ ఉద్దేశం బయటకు కన్పిస్తుందన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణం పెట్టే విధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కోట్ల మంది ప్రజలకు కరోనా టీకా ఇచ్చేందుకు సన్నాహకంలో ఉన్నామని నివేదించినా మొండివైఖరి అవలంబిస్తున్నారన్నారు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై లిఖితపూర్వకంగా మరియు స్వయంగానూ కలిసి విజ్ఞప్తి చేసినా మొండిగా ఎన్నికల తేదీలను ఖరారు చేయడం సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. ప్రజారోగ్యం అనే విశాల ప్రయోజనాలను పూర్తిగా పక్కన బెట్టి, ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహకారంతో ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారని ద్వివేది ఘాటుగా విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదిత్యనాధ్ దాస్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించే పరిస్థితులు లేవని స్పష్టం చేస్తూ ఎస్ఈసీకి లేఖ రాశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju