టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘటనల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై సభలు, ర్యాలీ లపై నిషేదం విధిస్తూ కీలక ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి శేష శయన రెడ్డి నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది.
కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్డు లో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా, గుంటూరులో చీరల పంపిణీలో జరిగిన ఘటనలో ముగ్గురు మహిళలు చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటనలపై జస్టిస్ శేషశయన రెడడి కమిషన్ కమిషన్ విచారించనున్నది. ఘటనపై కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.