NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి ప్రభుత్వ సిట్ పై సుప్రీం కోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు..ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

ఏపి ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టే పై సుప్రీం కోర్టు లో వాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్ధిక నిర్ణయాలు, ఇతర అంశాల దర్యాప్తునకు ఏపి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హైకోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు .. ఏపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై స్టే విధించింది. దీంతో ఏపి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

Supreme Court

 

సుప్రీం కోర్టులో జస్టిస్ ఎంఆర్ షా, ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం ముందు రెండు రోజులు (బుధ, గురువారం) విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు పూర్తి చేశారు. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకే ఒక పోలీస్ స్టేషన్ లో సిట్ ను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది సింఘ్వీ ధర్మాసనానికి నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామనీ, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. అమరావతి భూకుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్దారణ పై నిషేదం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

టీడీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ దవే వాదనలు వినిపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందని దవే పేర్కొన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉనప్పుడు టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలపై ఒక్క పిటిషన్ కూడా వేయలేదని వివరించారు. రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపితే తమకు అభ్యంతరం లేదని చెప్ప్రారు. రాజకీయ నేతలతో విచారణ జరపడం ఏమిటని దవే ప్రశ్నించారు. కమిటీలో ఎవరూ స్వతంత్రులు లేరనీ, అంతా వైసీపీ నేతలే ఉన్నారని దవే ధర్మాసనానికి వివరించారు. సిట్ విచారణ తర్వాతే కోర్టులో సవాల్ చేయవచ్చు కదా అని ధర్మాసనం ప్రశ్నించగా, అంత సమయం ఇవ్వకుండా అరెస్టుల పర్వం మొదలు పెట్టారని దవే తెలిపారు. హైకోర్టు స్టే విధించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై సుప్రీం కోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వవిధాన నిర్ణయాల్లో ప్రజా ధనం దుర్వినియోగం, వృధా ఉంటే దర్యాప్తు చేయకూడదా అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా అని ప్రశ్నించింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?