AP Govt: ఒ పక్క జగన్ సర్కార్ (YS Jagan Govt) పై ప్రతిపక్షాలు ఏదో ఒక అంశంపై విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఏపి (AP)కి జాతీయ స్థాయి అవార్డులు (National Awards) వస్తున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపి సర్కార్ మరో సారి సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of doing Business) లో మళ్లీ ఏపి మొదటి స్థానం కైవశం చేసుకుంది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 లో ఏపి నెంబర్ వన్ స్థానాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం టాప్ ఎబీవర్స్ పేరుతో ఏడు రాష్ట్రాలను ప్రకటించింది. ఇందులో ఏపి 97.89 శాతం స్కోర్ సాధించి ప్రధమ స్థానంలో నిలవగా, 97.77 శాతం స్కోర్ తో గుజరాత్ రెండవ స్థానంలో నిలిచింది. ఆ తరువాత తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ 94.86 శాతం స్కోర్ సాధించి మూడు, నాల్గవ స్థానాల్లో నిలిచాయి. టాప్ అచివర్స్ లో ఏపితో పాటు గుజరాత్, హర్యానా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు చోటు సంపాదించాయి.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
రాష్ట్రాలకు నాలుగు కేటగిరిలుగా కేంద్రం విభజించి ర్యాంకులు కేటాయించింది. ఈ సారి గతంలో మాదిరిగా కాకుండా కొత్త విధానాలతో కేంద్రం ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది. ర్యాంకుల కేటాయింపునకు కేంద్రం మొత్తం 10,200 మంది పెట్టుబడిదారులు, స్టేక్ హోల్డర్స్ నుండి అభిప్రాయాలను సేకరించింది. అని రంగాల్లోనూ ఏపి ప్రభుత్వంపై పెట్టుబడిదారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. కేంద్రం ఇచ్చిన ర్యాంకులపై ఏపి సర్కార్ హర్షం వ్యక్తం చేసింది. అచివర్స్ లిస్ట్ లో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్ లిస్ట్ లో అసొం, చత్తీస్గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. మరో వైపు..ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ విభాగంగా 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్ఛేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి.
కాగా ఏపి సర్కార్ పెట్టుబడులు ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పారిశ్రామిక వేత్తలకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తొంది. అదే విధంగా భూకేటాయింపులు, ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా కల్పిస్తొంది. ఈ కారణంగా పెట్టుబడిదారులకు అనువైన రాష్ట్రంలో ఏపి ఉందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటన లో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయులు కుదిరాయి. ఒక్క గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ లోనే లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. అదే విధంగా ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ సీఈవో తోనూ దావోస్ లో సీఎం జగన్ భేటీ అయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే ఏపిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు బైజూస్ కంటెంట్ అందించేందుకు ఒప్పందం చేసుకోవడం విశేషం.
Seven states are top achievers in Govt's Business Reforms Action Plan 2020 report.
Andhra Pradesh, Gujarat, Haryana, Karnataka, Punjab, Telangana & Tamil Nadu among best performers. #IndiaMeansBusiness pic.twitter.com/wdDFn5o2us
— PIB India (@PIB_India) June 30, 2022