AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఓ వైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా దానిపై ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వ న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. టీటీడీలో ఇటీవల ఏపి ప్రభుత్వం 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ 54 మందిలో చాలా మందికి నేరచరిత్ర ఉందంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని..మేటర్ ఏమిటంటే..?
AP High Court: తదుపరి విచారణ మార్చి 11వ తేదీకి వాయిదా
ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు గతంలో ప్రభుత్వ జీవోపై స్టే ఇచ్చిందనీ.. స్టే ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని పిటిషన్ల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం విచారణలో పిటిషనర్ల తరపు వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకు ముందు కూడా పలు పర్యాయాలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Read More: Ukraine Russia: జనం చేతిలో తుపాకీ .. యుద్ధం నేర్పిన కొత్త పాఠం..! ఉక్రెయిన్ సందేశం..!