AP High Court: సినిమా టికెట్ల ధరల విషయం మరో సారి హైకోర్టు (AP High Court) చెంతకు చేరింది. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీ వో 35ని నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో ఏపి ప్రభుత్వం అప్పీల్ చేసింది. ప్రభుత్వం తరపు వాదనలు వినాలని ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరాం సుబ్రమణ్యం హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్ ను ఏపి ప్రభుత్వం దాఖలు చేయగా ధర్మాసనం మధ్యాహ్నం వాదనలు విననుంది.
AP High Court: డివిజన్ బెంచ్ లో ఏపి సర్కార్ అప్పీల్
సింగిల్ బెంచ్ తీర్పుపై పెద్ద నిర్మాతలు, థియేటర్ యజమానులు ఓ పక్క ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం..డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు ఎలా ఉంటుందని ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం జారీ చేసిన జీ వో 35 ప్రకారం సినిమా టికెట్ ధరలు కొనసాగితే భారీ బడ్జెట్ సినిమాలకు ఏపిలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. త్వరలో ఆర్ఆర్ఆర్, భీమ్లానయక్, పుష్ప వంటి బారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. గత కొంత కాలంగా సినిమా టికెట్ల అంశంల ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య వివాదం నడుస్తోంది. ధరల విషయంలో పునరాలోచన చేయాలంటూ పలువురు సినీ ప్రముఖులు చేసిన విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించలేదు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!