ఏపి Andhra Pradesh హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (cj)గా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి aroop kumar goswamy బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ biswabhoosahan harichandan ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి (cm) వైఎస్ జగన్మోహనరెడ్డి YS jaganmohan reddy ఈ కార్యక్రమంలో పాల్గొని జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామికి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అనూప్ కుమార్ గోస్వామి ఇంతకు ముందు సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయిన విషయం తెలిసిందే.
సీజె ప్రమాణ స్వీకారం అనంతరం తేనీటి విందు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జస్టిస్ గోస్వామి హైకోర్టుకు చేరుకుని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి కేసుల విచారణ చేపట్టనున్నారు.
1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్ లో జన్మించిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గువాహటి ప్రభుత్వ లా కాలేజీ నుండి 1985లో లా డిగ్రీ పూర్తి చేశారు. అదే ఏడాది ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. అసోం హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2011 నుండి 2013 వరకూ నాగాలాండ్ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా సేవలు అందించారు. 2012 నుండి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైయ్యారు. 2018 నుండి రెండు పర్యాయాలు గువాహటి హైకోర్టు తాత్కాలిక సీజెగా బాధ్యతలు నిర్వహించారు. 2019 ఆక్టోబర్ 15న ప్రదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. గోస్వామి ఏపికి బదిలీపై రాకా ఇక్కడ సీజేగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళ్లారు.