AP High Court: కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకపోవడంతో అయిదుగురు ఐఏఎస్ అధికారులపై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని పరిహరం ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పరిహారం చెల్లించాలని ఆదేశాలను జారీ చేసినా అధికారులు చర్యలు చేపట్టలేదు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెల్లింపుల్లో జాప్యం జరగడంతో ఐఏఎస్ అధికారుల జీతాల నుండి కట్ చేసి పరిహారం ఇవ్వాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, ఎస్ఎస్ రావత్ కు నెల రోజుల జైలు, వెయ్యి రూపాయల జరిమానా, ముత్యాల రాజుకు రెండు వారాల జైలు, వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మరొక ఐఏఎస్ కు శిక్ష విధించింది. శిక్షపై అప్పీలు చేసుకునేందుకు వారికి హైకోర్టు నెల రోజులు గడువు ఇస్తూ నెల రోజులపాటు జైలు శిక్ష ను సస్పెండ్ చేసింది హైకోర్టు.